Tuesday, 14 April 2026 07:32:00 AM
# ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడిపై చర్యలు తీసుకోవాలి – ఏఐఎస్ఎఫ్ డిమాండ్. # ప్రతి ఒక్కరు విధిగా రహదారి నిబంధనలు పాటించాలి. సర్పంచ్ వేమూరి సత్యనారాయణ. # రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ – నేరాలకు దూరంగా ఉండాలని హెచ్చరిక... # ఆదోనిలో అత్యాధునిక కామత్ డెంటల్ వైద్యశాల ప్రారంభం – ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి.. # హైందవ ధర్మ ప్రచారం కోసం కృషి చేయాలి – ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి. # చిత్తూరు జిల్లా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు # అనంతపురం జిల్లా గ్రంథాలయంలో పూలే జయంతి వేడుకలు # అన్నమయ్యా జిల్లా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సంబరాలు # ఆదోని జిల్లా సాధన 150వ రోజు దీక్ష సభను ఘనంగా నిర్వహిద్దాం – జేఏసీ పిలుపు... # స్వచ్ఛతకు తొలి ప్రాధాన్యత – ఇంటింటి చెత్త సేకరణకు 20 వాహనాల ప్రారంభం... # కర్నూలు జిల్లాలో మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ # ఆకుపాముల గ్రామ నివాసి లిక్కి కృష్ణంరాజు వారి కుమారుడు లిక్కి వర్షిత్ సాహస యాత్ర విజయవంతం # సమానత్వ జ్యోతి వెలిగించిన మహానేత జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా # అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు # ఆస్పరి దాహార్తి ఎప్పుడు తీరుతుంది? # మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను సాధిస్తాం -- ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి... # మహాత్మ జ్యోతిరావు పూలె కు ఘన నివాళులు # వాట్సాప్ ద్వారా ఇంటర్మీడియట్ ఫలితాలు అందుబాటులోకి # రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు

మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ఎయిమ్స్‌లో మహిళా డాక్టర్ ఆత్మహత్య ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది

Date : 06 March 2026 10:37 AM Views : 41

DNB News - తెలంగాణ / : ఎయిమ్స్ భోపాల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ సృష్టి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఎన్‌హెచ్ఆర్సీ సభ్యుడు ప్రియాంక్ కనూంగో సీరియస్‌గా స్పందించారు. తన విభాగాధిపతి డాక్టర్ పర్వేజ్ తరచూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వేధింపుల కారణంగానే డాక్టర్ సృష్టి నిద్ర మాత్రలు ఎక్కువగా తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయంలో డాక్టర్ సృష్టి ఇప్పటికే మూడు సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ.. ఆస్పత్రి యాజమాన్యం సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎన్‌హెచ్ఆర్సీ.. భోపాల్ పోలీసులతో పాటు ఎయిమ్స్ యాజమాన్యం, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది. ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఇక యువ డాక్టర్ మృతి పట్ల ఎన్‌హెచ్ఆర్సీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా సమగ్ర దర్యాప్తు జరుగుతుందని వెల్లడించింది.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :