DNB News - తెలంగాణ / : పేద కుటుంబానికి అండగా 'సమ్మి గౌడ్ ఫౌండేషన్': కన్నీటి బాధలో ఉన్న దళిత కుటుంబానికి భరోసా! మృతుడు సోమారపు సాయిలు కుటుంబానికి పరామర్శ, క్వింటాల్ బియ్యం వితరణ.. క్లిష్ట సమయంలో ఉదారత చాటుకున్న అండగా సమ్మిగౌడ్ - కోతి వెంకటేశ్వర్లు గౌడ్ , మల్లయ్య యాదవ్ కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామం - మానవత్వమే మతం అని చాటుతూ, ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడంలో సమ్మి గౌడ్ ఫౌండేషన్ మరోసారి తన ఉదారతను చాటుకుంది. ఇంటికన్నె గ్రామానికి చెందిన దళిత కుటుంబ పెద్ద సోమరపు సాయిలు ఆకస్మిక మరణం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఈ విషయం కోతి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు మల్లయ్య విషయం తెలుసుకున్న ఫౌండేషన్ అధినేత చిలివేరు సమ్మి గౌడ్, బుధవారం బాధితుల ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. సాయిలు భార్య పూలమ్మ, కుమార్తె రమ్య మరియు వారి పిల్లలను ఓదార్చిన, సాయిలు చితపటానికి పూలు వేసి నివాళి అర్పించారు సమ్మి గౌడ్, "మేము ఉన్నాం.. అధైర్య పడకండి" అంటూ వారికి ధైర్యాన్ని నూరిపోశారు.ఇంటికన్నే గ్రామ పెద్దలు, కేవలం మాటలతో సరిపెట్టకుండా, తక్షణ సహాయంగా కింద ఆ కుటుంబానికి క్వింటాల్ బియ్యం అందజేశారు.. గ్రామ నాయకుల ప్రశంసలు: ఈ మానవీయ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..కేసముద్రం మండలంలో పార్టీలకు,కులాలకు, మతాలకు, సంబంధం లేకుండా కడు భీధవాడు కష్టం లో ఉన్నడు అనీ తెలియజేసిన వెంటనే భాదిత కుటుంబాలు క్లిష్ట సమయం లో ఉన్న సందర్బంలో స్పందించి వారి, వారి గ్రామానికి వచ్చి సమ్మి గౌడ్ చేస్తున్న సామాజిక సేవలు వెలకట్టలేనివి అని వారు ఈ సందర్భంగా కొనియాడారు.. కార్యక్రమంలో సమ్మిగౌడ్ వెంట కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు రాజులపాటి మల్లయ్య, కోతి వెంకటేశ్వర్లు, భూక్య దేవేందర్, చెలగోల కట్టయ్య, చిలగోల ముత్తయ్య, మిట్టగడుపుల యాకయ్య, కదిర రాజు, దోమ్మటి రాజు, కదిరి హరీష్, వర్దల్లి రంజిత్, బానోతు యాకోబు, మంగ్య, వార్డు సభ్యులు బోళ్ళ రమేష్, దారావత్ లాలు, భూక్య వెంకన్న తదితరులు పాల్గొని సమ్మి గౌడ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Admin
DNB News