DNB News - తెలంగాణ / : CPI (Maoist) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న బడే దామోదర్ అలియాస్ చొక్కారావు, రాష్ట్ర డీజీపీ Shivadhar Reddy సమక్షంలో లొంగిపోయినట్లు సమాచారం. దామోదర్ స్వగ్రామం ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామం. ఆయన లొంగుబాటుతో భద్రతా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దామోదర్ పై ఉన్న కేసులు, లొంగుబాటుకు కారణాలు, ప్రభుత్వ పునరావాస ప్యాకేజీ వివరాలు తదితర అంశాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ పరిణామం రాష్ట్ర మావోయిస్ట్ కార్యకలాపాలపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Admin
DNB News