Monday, 15 June 2026 01:43:57 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

బాలికపై లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది

Date : 15 March 2026 10:49 AM Views : 52

DNB News - తెలంగాణ / : ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో బాలికపై లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాయకరావుపేటలో చోటుచేసుకున్న ఈ ఘటనపై బాధితురాలు నాలుగు రోజుల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గం రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కావడంతో ఈ వ్యవహారం బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటన బయటకు రావడంతో గురువారం పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం… అనకాపల్లి జిల్లాకు చెందిన మైనర్ బాలికను తల్లిదండ్రులు విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదివేందుకు చేర్పించారు. హాస్టల్‌లో ఉంటున్న ఆ బాలికకు తన స్నేహితురాలి ద్వారా చినగదిలికి చెందిన దల్లి సాయిచంద్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆమెను ప్రేమించాలని ఒత్తిడి చేస్తూ నిందితుడు తరచూ వేధింపులకు గురి చేశాడు. తన ప్రేమను అంగీకరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. గత ఏడాది ఏప్రిల్‌లో బాలికను పాయకరావుపేట సమీపంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి అసభ్య వీడియోలు చిత్రీకరించాడు. అనంతరం ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ బ్లాక్‌మెయిల్ చేసి విశాఖలోని పెందుర్తి ప్రాంతంలో తన ఇంటికి తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి చివరి వారంలో కూడా బాలికను తన ఇంటికి తీసుకెళ్లి, జరిగిన విషయాన్ని పోలీసులకు చెబితే వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని ఆమె తల్లిదండ్రులను ఫోన్‌లో బెదిరించినట్లు సమాచారం. బాలిక మైనర్ అని తెలిసినా నిందితుడి తల్లి కూడా ఆమెను నెల రోజుల పాటు ఇంట్లోనే నిర్బంధించినట్లు పోలీసులు వెల్లడించారు. వేధింపులు తట్టుకోలేక ఈ నెల 8న బాలిక నిందితుడి ఇంటి నుంచి తప్పించుకుని తన తల్లిదండ్రుల వద్దకు చేరుకుని జరిగిన విషయాన్ని తెలిపింది. దీంతో వారు పాయకరావుపేట పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తులో నిందితుడు తీసిన వీడియోలను బాధితురాలి తల్లిదండ్రులకు పంపడంతో పాటు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వారి బంధువులకు కూడా పంపినట్లు పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరు అమ్మాయిలతో కూడా ఇదే విధంగా వీడియోలు తీసినట్లు విచారణలో బయటపడింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు దల్లి సాయిచంద్‌తో పాటు అతడి తల్లిని అరెస్టు చేశారు. కేసు పై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :