DNB News - తెలంగాణ / : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 58వ డివిజన్లో బీజేపీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. బీజేపీ రాష్ట్ర నాయకులు జీవీకే మనోహర్ పాల్గొని పార్టీ అభ్యర్థి దేవులపల్లి విద్యాసాగర్కు మద్దతుగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కలుసుకున్న జీవీకే మనోహర్ మరియు పార్టీ నాయకులు, కమలం గుర్తుకు ఓటు వేసి దేవులపల్లి విద్యాసాగర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. డివిజన్లో బీజేపీ ప్రచారం ఇతర పార్టీల కంటే ముందంజలో కొనసాగుతున్నట్టు నాయకులు పేర్కొన్నారు. అభ్యర్థి దేవులపల్లి విద్యాసాగర్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ప్రజలు ఆశీర్వదిస్తే డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డివిజన్లో ఎవరికైనా సమస్యలు వస్తే వెంటనే స్పందించి పరిష్కరించేందుకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఫుల్లెర్టన్ మురళి ఎం కిరణ్ గాంధీ రవీందర్ సంధ్యా ప్రియాంక శ్రీలత కవిత శోభ లక్ష్మి
Admin
DNB News