Wednesday, 17 June 2026 02:14:41 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

కుంభమేళా తరహాలోనే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది

Date : 10 March 2026 06:13 PM Views : 70

DNB News - తెలంగాణ / : కుంభమేళా తరహాలోనే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. “గోదావరి పుష్కరాలు–2027”ను తెలంగాణ బ్రాండ్ ప్రతిబింబించేలా నిర్వహించేందుకు క్యాబినెట్ సబ్ కమిటీ ప్రణాళికలు రూపొందిస్తోంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశంలో ఈ అంశంపై సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. వేద పండితుల నిర్ణయం ప్రకారం 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు ఆది పుష్కరాలు, 2028 జూలై 13 నుంచి 24 వరకు అంత్య పుష్కరాలు నిర్వహించనున్నారు. ఈ పుష్కరాలకు సుమారు 8 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గోదావరి ప్రవహించే జిల్లాల్లో ప్రముఖ దేవాలయాలను అనుసంధానిస్తూ మొత్తం 96 ప్రాంతాలను పుష్కర ఘాట్లుగా ప్రత్యేకంగా ఎంపిక చేశారు. గత పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాల్లో ఘాట్లు, రహదారులు, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు. ఈ నెలాఖరుకల్లా డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి దశలో అధిక రద్దీ ఉండే తొమ్మిది ప్రాంతాలను “టైర్–1”గా గుర్తించి అక్కడ యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టనున్నారు. పుష్కరాల నిర్వహణలో సమన్వయ లోపం తలెత్తకుండా ప్రత్యేక స్పెషల్ ఆఫీసర్‌ను నియమించడంతో పాటు ప్రతి శాఖకు నోడల్ అధికారులను కూడా నియమించనున్నారు. ప్రతి ఘాట్ వద్ద ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర మార్గాలు, ఆధునిక వైద్య సదుపాయాలు, పార్కింగ్ ఏర్పాట్లు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. పుష్కరాల ఏర్పాట్లలో ఎలాంటి రాజీ ఉండదని, నాణ్యతతో పనులు పూర్తి చేయాలని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :