DNB News - తెలంగాణ / : కృష్ణా జిల్లాలోని ఉయ్యూరులో విద్యార్థులపై అమానుష శిక్ష విధించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. క్రమశిక్షణ పేరుతో చిన్నారి విద్యార్థులకు చెప్పుల దండలు వేసి అవమానించిన ఘటనపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటన Uyyuru లోని Vijaya Sai School, Uyyuru లో చోటుచేసుకుంది. పాఠశాల విద్యార్థులు కొందరు అల్లరి చేశారనే కారణంతో ఉపాధ్యాయులు వారిని మందలించకుండా ఏకంగా మెడలో చెప్పుల దండలు వేసి పాఠశాల ప్రాంగణంలో నిలబెట్టారు. తోటి విద్యార్థుల ముందు ఇలా అవమానించడంతో ఆ చిన్నారులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే పాఠశాల వద్దకు చేరుకుని యాజమాన్యాన్ని నిలదీశారు. “మా పిల్లలను చదివించి మంచి భవిష్యత్తు కోసం స్కూల్కు పంపిస్తున్నాం గానీ ఇలా అవమానించేందుకు కాదు” అంటూ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటనపై బాధ్యులైన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ముందు ఆందోళనకు దిగారు.
Admin
DNB News