DNB News - తెలంగాణ / : ఎన్నికల ఫలితాల తర్వాత అజ్ఞాతంలోకి యాదగిరి.. ఆచూకీ తెలియడంలేదు కిడ్నాప్ చేశారంటూ యాదగిరి కుటుంబ సభ్యుల ఫిర్యాదు.. చైర్మన్ ఎన్నిక విషయంలో పేచీ...తనకు చైర్మన్ పదవి ఇవ్వాలని కోరిన యాదగిరి...! నీలాంటి బిసి వాళ్ళకి ఎలా ఇస్తామంటూ మంచిరెడ్డి అవమానించి అడ్డుకున్నట్లు ఆరోపణలు..! దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిన యాదగిరి.. చైర్మన్ ఎన్నిక రోజు ప్రత్యక్షమైన యాదగిరి.. తనను ఎవరూ కిడ్నాప్.చేయలేదంటూ వివరణ.. ఇదిలా ఉండగా కిడ్నాప్ చేశారంటూ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో ఆలస్యంగా దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు..! మంచిరెడ్డి కిషన్ రెడ్డి – మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి లకు పోలీసుల నోటీసులు హైదరాబాద్ :- ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇద్దరూ అందుబాటులో లేకపోవడంతో పోలీసులు వారి నివాసానికి వెళ్లినట్లు సమాచారం. ఇంటికి తాళం వేసి ఉండటంతో, మలక్పేట్లోని తిరుమల హిల్స్లో ఉన్న వారి ఇంటి వద్దకు వెళ్లి నోటీసులను అతికించారు. పలు సెక్షన్ల కింద ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం..! రాజకీయంగా ఆసక్తిగా మారిన నోటీసులు...
Admin
DNB News