Tuesday, 28 April 2026 04:13:23 PM
# పేదలకు కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి :- ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి # మాదిగ యువకుడు విజయభాస్కర్ హత్య పై మడకశిర ఎమ్మెల్యే MS రాజు ను కలసిన ఎమ్మార్పీఎస్ ప్రతినిధి బృందం # దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ అధినేతకు పితృ వియోగం.. # రాత్రి వేళల్లో కర్నూలులో కట్టుదిట్టమైన పోలీసింగ్ – ప్రజల భద్రతే లక్ష్యం.. # కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతపై ఆగ్రహం – తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్... # పట్టుదలతో పతకాల వర్షం… అంతర్జాతీయ వేదికపై ఆదోని మహిళల ఘనత... # మండల వ్యాప్తంగాఘనంగా గులాబీ జెండా రెపరెపలుబీఆర్ఎస్ పార్టీఆవిర్భావ దినోత్సవ వేడుకలు # ఆదోని జిల్లా కోసం 163వ రోజు దీక్ష – హామీ కోసం జేఏసీ ఆగ్రహం.. # పొరంబోకు భూమిపై రాజకీయ గేమ్… హెచ్చరిక బోర్డు ధ్వంసం కలకలం.. # 121 ఫిర్యాదుల స్వీకరణ – చట్టపరంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తాం కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ # పెట్రోల్, డీజిల్ కొరత లేదు – ఆందోళన వద్దు, అదనపు కొనుగోళ్లు చేయొద్దు: కలెక్టర్, ఎస్పీ హెచ్చరిక.. # ఆంధ్ర రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ కోసం సామాన్య ప్రజలు బారులు తీరడం # టిఆర్ఎస్ జండా ఆవిష్కరణ # హిందూధర్మం అంటే మతం కాదు, జీవన విధానం. .. # జై వడ్డె ఓబన్న జై వడ్డెర # వైసీపీకి భారి షాక్ – బీజేపీలోకి 30 కుటుంబాల ఘన చేరిక.. # కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం # భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ # నిజం చెప్పడం వల్ల అసౌకర్యం కలిగినా బాధ్యతతో వ్యవహరించాలి – సీనియర్ జర్నలిస్టు మగ్ధుం భాష... # హరీశ్ రావు ని శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్రామస్థుల ఆహ్వానం

కల్తీ/ బిటి -3 విత్తనాల నిర్మూలనకు విత్తన టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు

Date : 26 April 2026 11:52 AM Views : 14

DNB News - తెలంగాణ / : మునగాల మండలంలో విత్తనాలు, ఎరువుల టాస్క్ఫోర్స్ టీమ్స్ ని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల వ్యవసాయ అధికారి, తహసిల్దార్, మండల ఎస్సై ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మండల టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో మునగాల లోని మన గ్రోమోర్ సెంటర్ విత్తన దుకాణాన్ని పరిశీలించడం జరిగింది. మండలం లో బిటి -3/ నకిలీ / అక్రమ విత్తనాల నిర్మూలన సమర్థవంతంగా చేయుటకు ఈ టాస్క్ఫోర్స్ టీం పని చేయడం జరుగుతుంది. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు . లైసెన్స్ ఉన్న డీలర్ల ద్వారా మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి తెల్లటి బట్ట సంచుల్లో లేదా సరైన లేబుల్ లేకుండా ప్యాక్ చేసినవి / అసలు కంపెనీ ప్యాకెట్లను అనుకరించి వదులుగా అమ్మేవి ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయకూడదు ముఖ్యంగా ప్రభుత్వం చే నిషేధించబడిన బీటీ 3 పత్తి విత్తనాలు అమ్మేవారు, కొనుగోలు చేసిన రైతులు చట్టరీత్యా బాధ్యులు అవుతారు . విత్తనాల కొనుగోలుకు బిల్ తప్పనిసరిగా తీసుకోవాలి . తాత్కాలికంగా వచ్చేవారు, ధర తక్కువకే అమ్మే విత్తనాలు మరియు రాత్రి వచ్చి అమ్మే వ్యక్తుల వద్ద విత్తనాలు కొనవద్దు అని రైతులకు తెలియజేయడం జరిగింది అలాగే గ్రామాలలో ఎవరైనా బిటి-3 ప్రత్తి విత్తనాలు అమ్మేవారు లేదా కొనేవారు ఉన్నట్లయితే వారి సమాచారం తప్పనిసరిగా పోలీస్ శాఖకు లేదా వ్యవసాయ శాఖకు సమాచారం అందించవలసిందిగా కోరడమైనది ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ సరిత, మండల వ్యవసాయ అధికారి రాజు, ఎస్సై ప్రవీణ్ కుమార్,మండల ఆర్ ఐ రామారావు, డీలర్ రాజేష్ పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: