DNB News - తెలంగాణ / : మునగాల మండలంలో విత్తనాలు, ఎరువుల టాస్క్ఫోర్స్ టీమ్స్ ని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల వ్యవసాయ అధికారి, తహసిల్దార్, మండల ఎస్సై ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మండల టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో మునగాల లోని మన గ్రోమోర్ సెంటర్ విత్తన దుకాణాన్ని పరిశీలించడం జరిగింది. మండలం లో బిటి -3/ నకిలీ / అక్రమ విత్తనాల నిర్మూలన సమర్థవంతంగా చేయుటకు ఈ టాస్క్ఫోర్స్ టీం పని చేయడం జరుగుతుంది. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు . లైసెన్స్ ఉన్న డీలర్ల ద్వారా మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి తెల్లటి బట్ట సంచుల్లో లేదా సరైన లేబుల్ లేకుండా ప్యాక్ చేసినవి / అసలు కంపెనీ ప్యాకెట్లను అనుకరించి వదులుగా అమ్మేవి ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయకూడదు ముఖ్యంగా ప్రభుత్వం చే నిషేధించబడిన బీటీ 3 పత్తి విత్తనాలు అమ్మేవారు, కొనుగోలు చేసిన రైతులు చట్టరీత్యా బాధ్యులు అవుతారు . విత్తనాల కొనుగోలుకు బిల్ తప్పనిసరిగా తీసుకోవాలి . తాత్కాలికంగా వచ్చేవారు, ధర తక్కువకే అమ్మే విత్తనాలు మరియు రాత్రి వచ్చి అమ్మే వ్యక్తుల వద్ద విత్తనాలు కొనవద్దు అని రైతులకు తెలియజేయడం జరిగింది అలాగే గ్రామాలలో ఎవరైనా బిటి-3 ప్రత్తి విత్తనాలు అమ్మేవారు లేదా కొనేవారు ఉన్నట్లయితే వారి సమాచారం తప్పనిసరిగా పోలీస్ శాఖకు లేదా వ్యవసాయ శాఖకు సమాచారం అందించవలసిందిగా కోరడమైనది ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ సరిత, మండల వ్యవసాయ అధికారి రాజు, ఎస్సై ప్రవీణ్ కుమార్,మండల ఆర్ ఐ రామారావు, డీలర్ రాజేష్ పాల్గొన్నారు
Admin
DNB News