Monday, 15 June 2026 02:28:34 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో వైభవంగా పుష్పయాగం

Date : 09 February 2026 11:13 AM Views : 59

DNB News - తెలంగాణ / : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి అనుబంధ దేవాలయమైన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో స్వాతి నక్షత్రం సందర్భంగా ఆదివారం పుష్పయాగం మరియు విశేష పూజా కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం 6.30 గంటలకు ఆలయ అద్దాల మండపంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వేద పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా సాగిన ఈ కార్యక్రమాల్లో స్వామివారికి విశేష పుష్పారాధనలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సుగంధ పుష్పాలతో పుష్పయాగం నిర్వహించి స్వామివారిని అత్యంత భక్తితో పూజించారు. పుష్పయాగం సందర్భంగా ఆలయం భక్తిమయ వాతావరణంతో కళకళలాడింది. స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించగా, ఆ దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. స్వాతి నక్షత్రం సందర్భంగా నిర్వహించే ఈ పుష్పయాగం అత్యంత శుభకార్యమని, భక్తులకు సకల శుభాలు కలుగుతాయని వేద పండితులు తెలిపారు. ఈ పవిత్ర కార్యక్రమంలో భద్రాచలం పట్టణంతో పాటు పరిసర గ్రామాలు, మండలాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శన భాగ్యాన్ని పొందారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయగా, స్వామివారి అనుగ్రహం లభించిందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ పుష్పయాగం మరియు విశేష పూజా కార్యక్రమాలు శ్రీనివాసాచార్యులు గారి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించబడినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఎలాంటి అవాంతరాలు లేకుండా కార్యక్రమం ప్రశాంతంగా, భక్తిమయ వాతావరణంలో ముగిసిందని ఆలయ అధికారులు తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :