DNB News - తెలంగాణ / : అశ్వరావుపేట జనవరి 24 (డి ఎన్ బి న్యూస్ ): ముందుగా ఎంపీ వద్ది రాజు రవిచంద్ర జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తనను కోసిన పైస లేదని పదేపదే చెప్పిన రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తాడని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ఎస్ అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రశ్నించారు శనివారం అశ్వరావుపేటలోని శ్రీ సత్య సాయి కళ్యాణ మండపంలో మున్సిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయాత్త o చేస్తూ ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అశ్వరావుపేట అభివృద్ధి బి ఆర్ఎస్ హయాంలోనే సాధ్యమైందని ఆయన సూచించారు. మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు. కృషితో 2 50 కోట్లు నిధులతో 100 పడక గదుల ఆసుపత్రి. కోర్టు. డిగ్రీ కళాశాల. సెంట్రల్ లైటింగ్ వంటి ఎన్నో పనులు చేపట్టారని నేడు పట్టణంలో జరుగుతున్న పనులన్నీ గత ప్రభుత్వం పుణ్యమే అని ఆయన అన్నారు. బంగారు తెలంగాణ కెసిఆర్ ప్రభుత్వం తోనే సాధ్యమని. ఆయన మళ్లీ సీఎం కావాలని ప్రజలు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు 2028 లో జరిగే ఎన్నికల్లో బి ఆర్ఎస్ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరని, మూడోసారి సీఎం గా బాధ్యతలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. రేవంత్ మోసపూరిత వాగ్దానాలు గృహిణులకు 2500 వృద్ధులకురూ 4000, వికలాంగులకు 6000రూ, రైతుబంధు 15000 ఇస్తానని చెప్పి కాంగ్రెస్ మాట తప్పిందని ధ్వజమెత్తారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా తులం బంగారం ఇస్తానన్న హామీ ఏమైంది ఎద్దేవా చేశారు రైతులకు ఇచ్చేందుకు డబ్బులు లేవు కానీ కొడుకు ఆట కోసం 200 కోట్లు ఎక్కడినుంచి వచ్చాయి? అని నిలదీశారు. ఈ సమావేశం సందర్భంగా త్వరలో జరగబోవు మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి జనసేన పార్టీ శ్రేణులు అంతా సమిష్టిగా కలిసి పనిచేసి బి ఆర్ఎస్ ను గెలిపించాలని ఆయన కోరారు. ఎల్లప్పుడూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు సిపిఎం నుంచి టిఆర్ఎస్ లో చేరిన పాలవలస జీవన్ రావు, తగరం జగన్నాథం లకు కండువా కప్పి పార్టీలోకి రేగ కాంతారావు ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించి ఓట్లు అభ్యర్థించాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో ఎనిమిది వందల కోట్ల తో అభివృద్ధి చేశారని అశ్వరావుపేట కి 250 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మన ప్రభుత్వం చేపట్టిన పనులు చూపించి ఓట్లు అడగాలి అని కార్యకర్తలకు సూచించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు యూఎస్ ప్రకాష్ రావు, సున్నం నాగమణి, వర్గెల పూజ, కోటగిరి సీతారామస్వామి, జూపల్లి పద్మజ, బ్రహ్మ రావు, జుజ్జురి వెంకన్న బాబు, మందపాటి రాజమోహన్ రెడ్డి, కాసాని చంద్రం, మోటూరి మోహన్ టిడిపి నాయకులు కట్రం స్వామి దొర, నార్లపాటి శ్రీనివాసరావు, జనసేన నాయకులు వినోద్, ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
DNB News