DNB News - తెలంగాణ / : కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండల కేంద్రంలోని శ్రీ చైతన్య సివో ఐపిఎల్ బ్రాంచ్లో పదో తరగతి ఫలితాలు కరీంనగర్ పట్టణంలోనే టాప్ మార్కులు సాధించారని తెలియజేశారు. బాణాసంచా కాల్చి స్వీట్ లను పంచుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ రాజకుమార్ ఆచార్య గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 2025-26 పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోని నెంబర్ వన్ స్థానాన్ని సాధించిన శ్రీ చైతన్య విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో మా శ్రీ చైతన్య విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచారు. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో టాప్ మార్కులు సాధించిన వితిక కృష్ణ 597/600 కరీంనగర్ జోన్ లో చింతగుంట బ్రాంచ్ విద్యార్థిని గూగుల్ చరిష్మా 588/600, రాధా 588/600, స్వేచ్ఛ హర్షిత్ 588/600 కరీంనగర్ పట్టణంలో ఉన్న చింతకుంట బ్రాంచ్ టాప్ మార్కులు సాధించారు. 550 కి పైగా 60 మంది విద్యార్థులు 500 పైగా 52 విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని హర్షం వ్యక్తం చేశారు. మొన్న యుజిసి జేఈఈ మెయిన్స్ ఫలితాలలో కూడా టాప్ వన్ ర్యాంకు సాధించిన విద్యార్థిని విద్యార్థులు ఏ పరీక్షలో లైన మా శ్రీ చైతన్య విద్యార్థులు సత్తా చాటుతారని తెలియజేశారు. భవిష్యత్తులో ఎలాంటి పోటీ పరీక్షల్లో లైన మా శ్రీ చైతన్య విద్యార్థులు పోటీపడి చదివి ఉత్తమ మార్కులు సాధించడం జరుగుతుంది. మా శ్రీ చైతన్య విద్యాసంస్థలలో అకాడమిక్స్ పై ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతూ వారికి ఆలిండియా స్థాయిలో ఉన్న రిసోర్స్ పర్సన్ ద్వారా ఎల్లవేళలా వాళ్లకు వచ్చిన డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ సబ్జెక్ట్ టీచర్లు కూడా విద్యార్థులకు అండగా ఉంటూ వారికి భవిష్యత్తులో జరగబోయే పోటీ పరీక్షలలో మార్కులు ఎలా సాధించాలో తరగతి గదిలోనే నేర్పించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ప్రతి ఉపాధ్యాయుడు వారికి ఉన్న సమయంలో 10వ తరగతి విద్యార్థులకు సబ్జెక్టులపై అవగాహన కల్పిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గా బోధన చేస్తున్నారు. ఇందుకోసం మా శ్రీ చైతన్య సిఓ ఐపీఎల్ బ్రాంచ్ లో ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధించమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సీమ, నాగేంద్ర, చైర్మన్ మల్లంపాటి శ్రీధర్, డైరెక్టర్ మల్లంపాటి శ్రీవిద్య గార్లు మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం ఏం రాజు,సదాశివరెడ్డి (ఏజీఎం ఆపరేషన్), అకాడమీ కోఆర్డినేటర్ ప్రవీణ్, ఏవో హరికిషన్ రెడ్డి, విద్యార్థిని విద్యార్థులకు విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ ప్రిన్సిపాల్ నీలిమారావు, వైస్ ప్రిన్సిపాల్ గోవర్ధన్, ఐపీఎల్ ఇన్చార్జ్ శ్రీకాంత్ రెడ్డి, సి బ్యాచ్ ఇంచార్జ్ జైవర్దన్ రెడ్డి, మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థులకు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Admin
DNB News