DNB News - తెలంగాణ / : కొత్తగూడెం పట్టణంలోని 50వ డివిజన్లో త్రాగునీటిలో పురుగులు వస్తున్నాయన్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని 50వ డివిజన్ కార్పొరేటర్ దాసరి శ్రీను స్పష్టం చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందిస్తూ వివరణ ఇచ్చారు. ఈ విషయంపై కొంతమంది వ్యక్తులు సీపీఐ నాయకులపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. వాస్తవాలు ఏమిటో తెలుసుకోవాలంటే సంబంధిత వ్యక్తులు ఘటన స్థలానికి వచ్చి పరిస్థితిని పరిశీలించాలని సూచించారు. సింగరేణి పైప్లైన్లో మరమ్మతులు జరగాలంటే ముందుగా సింగరేణి సంస్థ యాజమాన్యంతో చర్చించి పనులు చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. ఆ ప్రక్రియ గురించి తెలియని వారు నిరాధార ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్పై అనవసరంగా బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని ఆయన సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని కార్పొరేటర్ దాసరి శ్రీను తెలిపారు.
Admin
DNB News