Monday, 15 June 2026 02:00:52 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

పేరుకే సీసీ కెమెరాలు పట్టించుకోని అధికారులు

Date : 08 April 2026 03:03 PM Views : 40

DNB News - తెలంగాణ / : ప్రభుత్వ ఆసుపత్రిలో దొంగలు పట్టుకోవడం లో ప్రభుత్వం విఫలం పేరుకే సీసీ కెమెరాలు పట్టించుకోని అధికారులు ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ వార్త : ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతున్నాయని దొంగలను పట్టుకోవడంలో అటు అధికారులు ఇటు పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైందని బిజెపి టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ ఆరోపించారు. బుధవారం వాహనాలు చోరీకి గురవుతున్న విషయం తెలుసుకొని ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్య కారణాలవల్ల వివిధ ప్రాంతాల నుండి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి వాహనాలు ద్వారా వచ్చేవారికి దొంగలు చుక్కలు నరకం చూపిస్తున్నారని, రోగి సహాయకులు, రోగిని చూసేందుకు వచ్చిన బంధువులు వారి వాహనాలను ఆస్పత్రి ఆవరణలో పార్కింగ్ చేస్తుంటారు. రోగులు వారి బాధల్లో వారు ఉంటే ఇదే అదునుగా భావించి కొందరు దొంగలు రెక్కీ నిర్వహించి వాహనాలకు హ్యాండిల్ లాక్ వేసినప్పటికీ. బైక్ లను దొంగిలించడం పరిపాటిగా మారింది. గతంలో సైతం బైకులు పోయిన ఘటనలు ఉన్నప్పటికీ ఇటు వైద్యాధికారులు, అటు పోలీసు అధికారులు ఎలాంటి భద్రత చర్యలు చేపట్టకపోవడం బాధాకరం అన్నారు.ఆసుపత్రి ఆవరణలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కేవలం కెమెరాలు చూసేందుకు తప్ప ఎక్కడ పనిచేయకపోవడం తో ఇదంతా కూడా ఆసుపత్రి వర్గాలకు సంబంధించి చోరీలు జరుగుతున్నాయనే ఆరోపణలు లేకపోలేదన్నారు.ఎందుకంటే ఆసుపత్రి ఆవరణలో ఎక్కడ సీసీ కెమెరాలు పనిచేయడం లేదనే విషయం ఆసుపత్రి వర్గాలకు తప్ప మరెవరికి తెలిసే విషయం లేదు. గతంలో టోకెన్ ఇచ్చి వచ్చే వారికి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చేసేవారు,కానీ వాహనాల పార్కింగ్ ను ఓ కాంట్రాక్టర్ లీజు తీసుకొని నడిపిస్తున్న క్రమంలో సోమవారం ఒక్కరోజే మూడు ద్విచక్ర వాహనాలు చోరీకి గురవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆసుపత్రిలో పనిచేసే ఉద్యోగులు, జర్నలిస్ట్ ల వాహనాలకే దిక్కు లేకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ ఆయన ప్రశ్నించారు. అనారోగ్య కారణాలతో ఆసుపత్రికి వస్తున్న సామాన్యుల వాహనాలకు భద్రత లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటే జంకుతున్నారని,అసలే అనారోగ్యాలు ఆపై వాహనాలు చోరీకి గురవడంతో ఇక ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో సామాన్యులు అల్లాడుతున్నారన్నారు.ఇప్పటికైనా అటు పోలీస్ యంత్రాంగం, ఆసుపత్రి వర్గాలు సరైన చర్యలు చేపట్టి సామాన్యుల వాహనాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరుతున్నారు.లేని యెడల ఆందోళన చేస్తామని హెచ్చరించారు.జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రిలో నిఘా ఏర్పాటు చేయకపోవడం సిగ్గు చెటని ఇప్పటికే ఎంతో మంది సామాన్యుల వాహనాలు పోయి ఇబ్బంది పడుతున్నారాన్నారు.అసలు ఆసుపత్రి వర్గాలు ఎం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అధికారులు ఇటు మంత్రులు దృష్టి సారించకపోవడంతోనే వాహన చోదకులు పెరిగిపోతున్నారని ఆరోపించారు.ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటుచేసి ఆసుపత్రికి వస్తున్న వారి వాహనాలను కాపాడాలని ఆయన డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం లో తాజనూత భద్రం, రుద్ర గాని మాధవ్, పాశం శ్రీనివాసరెడ్డి, ఈశ్వర ప్రగడ లలిత దాసరి వీరభద్రం, ఇనుగుర్తి ఉపేంద్ర, శ్రీజర్ల వెంకట్ ఉన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :