Wednesday, 17 June 2026 02:13:23 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఏసీబీ సడెన్ చెక్

Date : 09 March 2026 11:53 AM Views : 62

DNB News - తెలంగాణ / : రంగారెడ్డి జిల్లా ఏసీబీ అధికారులు శేరిలింగంపల్లి సర్కిల్-49 డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో సడెన్ చెక్ నిర్వహించారు. నమ్మకమైన సమాచారం ఆధారంగా మార్చి 6, 2026న శేరిలింగంపల్లి జోన్‌లోని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈ తనిఖీలు చేపట్టారు. కార్యాలయంలోని రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, పెండింగ్ దరఖాస్తులు, అలాగే కార్యాలయ నిర్వహణపై అధికారులు సమగ్రంగా పరిశీలించారు. డిసెంబర్ 2, 2025న జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న శేరిలింగంపల్లి సర్కిల్-20ను పునర్వ్యవస్థీకరించి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకువచ్చి సర్కిల్-49గా మార్చారు. ఈ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ కొనసాగుతున్నందున డిసెంబర్ 2, 2025కు ముందు రికార్డులు సర్కిల్-49 కార్యాలయంలో అందుబాటులో లేవని అధికారులు తెలిపారు. అందువల్ల డిసెంబర్ 2025 నుంచి ఉన్న రికార్డుల ఆధారంగా తనిఖీలు నిర్వహించారు. డిసెంబర్ 2025 నుంచి ఇప్పటివరకు మొత్తం 285 భవన అనుమతి దరఖాస్తులు అందాయి. అందులో 134 దరఖాస్తులకు అనుమతి ఇచ్చారు. 21 దరఖాస్తులను తిరస్కరించగా, 63 దరఖాస్తులు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి. మిగతా దరఖాస్తులు షార్ట్‌ఫాల్ నోటీసులు, ఫీజు సమాచారం, హోల్డ్ వంటి దశల్లో ఉన్నట్లు గుర్తించారు. పరిశీలనలో ఉన్న దరఖాస్తుల్లో 16 సెక్షన్ ఆఫీసర్ వద్ద, 25 అసిస్టెంట్ సిటీ ప్లానర్ వద్ద, 22 డిప్యూటీ కమిషనర్ వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. వీటిలో 21 దరఖాస్తులు నిర్ణయించిన 21 రోజుల గడువును మించి పెండింగ్‌లో ఉండటం గమనించారని అధికారులు తెలిపారు. ఇందులో 5 దరఖాస్తులు అసిస్టెంట్ సిటీ ప్లానర్ వద్ద, 16 దరఖాస్తులు డిప్యూటీ కమిషనర్ వద్ద ఆలస్యంగా ఉన్నట్లు గుర్తించారు. అదే సమయంలో అనధికార నిర్మాణాలపై 63 ఫిర్యాదులు అందాయి. వాటిలో చాలా కేసుల్లో రెండో నోటీసులు జారీ చేసినప్పటికీ, 14 కేసుల్లో గడువు ముగిసినా తదుపరి చర్యలు తీసుకోకుండా ఫైళ్లు పెండింగ్‌లో ఉంచినట్లు వెల్లడైంది. కొన్నిచోట్ల అనధికార నిర్మాణాలపై నెలల తరబడి, కొన్ని కేసుల్లో ఏడాది పైగా తుది ఆదేశాలు ఇవ్వకుండా కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఇంకా 10 కేసుల్లో మొదటి నోటీసు ఇచ్చిన తర్వాత నిర్ణీత గడువు ముగిసినా రెండో నోటీసులు జారీ చేయలేదు. నాలుగు కేసులు ప్రస్తుతం కోర్టుల్లో పెండింగ్‌లో ఉండగా, మరో కేసులో రెండో నోటీసు సిద్ధం చేసినప్పటికీ సంబంధిత వ్యక్తికి అందజేయక ఫైల్ పెండింగ్‌లో ఉంచినట్లు గుర్తించారు. తనిఖీల సమయంలో కొంతమంది అధికారుల నుంచి ప్రైవేట్ వ్యక్తులకు అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ లావాదేవీలపై మరింత దర్యాప్తు అవసరమని అధికారులు తెలిపారు. మొత్తంగా ఈ సడెన్ చెక్‌లో కార్యాలయంలో పనుల ఆలస్యం, సరైన పర్యవేక్షణ లేకపోవడం, అనధికార నిర్మాణాలపై చర్యల్లో నిర్లక్ష్యం ఉన్నట్లు తేలింది. దీనిపై పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏసీబీ సూచించనున్నట్లు అధికారులు తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :