DNB News - తెలంగాణ / : కరీంనగర్ ఏప్రిల్ 24 డి ఎన్ బి న్యూస్ ఈ వేసవి సెలవులను సెల్ ఫోన్లు, టీవీలు, ట్యాబ్లకే పరిమితం కాకుండా, విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తు కోసం సాఫ్ట్వేర్ నైపుణ్యాలను నేర్చుకోవాలని రోహేలాస్ టెక్ ప్రతినిధులు కోరారు. రోల్ టెక్ ఐటీ సొల్యూషన్స్ వారు తమ 'ట్రైనీ టెక్కి' విభాగం ద్వారా 6వ తరగతి నుండి 12వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మూడు సాఫ్ట్వేర్ కోర్సులను ప్రారంభించారు.కోర్సుల వివరాలు డిజిటల్ మార్కెటింగ్ పైథాన్ కోడింగ్ (బిగినర్స్ కోసం) ఏఐ టూల్స్,ఈ 45 రోజుల శిక్షణా కాలంలో విద్యార్థులకు సింగపూర్, పూణే, హైదరాబాద్ వంటి నగరాలకు చెందిన అనుభవజ్ఞులైన నిపుణులు శిక్షణ ఇవ్వనున్నారు. కరీంనగర్ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని స్థానికంగానే 'రోహేలాస్ టెక్' ద్వారా అందించడం గర్వకారణమని వారు తెలిపారు. సెలవుల్లో సమయాన్ని వృథా చేయకుండా ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. మరిన్ని వివరాల కోసం వెంటనే రోహేలాస్ టెక్ కార్యాలయాన్ని సంప్రదించాల్సిందిగా కోరారు.
Admin
DNB News