DNB News - తెలంగాణ / : ఏప్రిల్లో డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్ల నియామకం: మంత్రి దామోదర తెలంగాణలోని ప్రభుత్వ దవాఖానాల్లో డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లతో సహా ఖాళీ పోస్టులను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. గత రెండేండ్లలో 10 వేల పోస్టులు భర్తీ చేయగా, మరో 7 వేలకు పైగా పోస్టుల నియామక ప్రక్రియ తుది దశలో ఉంది. ఏప్రిల్ నాటికి 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ పూర్తవుతుందని, వైద్య విధాన పరిషత్ హాస్పిటళ్లలో 1,616 స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకం మరో నెలలో ముగుస్తుందని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ మెడికల్ షాపులను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, జనరిక్ మెడికల్ షాపులను ప్రోత్సహిస్తామని వెల్లడించారు.
Admin
DNB News