DNB News - తెలంగాణ / : మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామ పంచాయతీ ఆవరణలో. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ జెండా ఆవిష్కరణ చేసి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు లో బలిదానం చేసుకున్న అమరులను. స్మరించుకుని. తదుపరి సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఎన్నో ఏళ్ల సాకారం. మలిదశ ఉద్యమంలో పాల్గొని తమ ప్రాణాలను బలిదానం చేసిన అమరుల త్యాగమే స్వరాష్ట్ర సాధన సాకారం అని అనేక మంది అమర వీరుల త్యాగాలు.విధ్యార్థుల పోరాటాలు. సకల జనుల సమ్మె ప్రభావం. ప్రజల ఆకాంక్షల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు వారిని స్మరించుకోవాలని. అలాగే సాధించుకున్న తెలంగాణ లో వ్యవసాయం విద్య వైద్యం సాగునీరు తాగునీరు విద్యుత్ మౌలిక సదుపాయాలు పారిశ్రామికంగా ఇంకా అనేక రంగాలలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని అలాగే గ్రామ అభివృద్ధిలో రైతులు మహిళలు విద్యార్థులు యువత భాగస్వామ్యం కావాలని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రెడ్డబోయిన ప్రశాంత్ వార్డ్ సభ్యులు షేక్ అజీజ్ మియా పచ్ఛిపాల అశ్విని వీరబోయిన నరేష్ కేసగాని కామేశ్వరి వెంకన్న రేవూరి కళ్యాణి బాబు మీసాల బిక్షం పంచాయతీ కార్యదర్శి బాలరాజు గ్రామ పెద్దలు మహిళలు యువత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
Admin
DNB News