DNB News - తెలంగాణ / : జగిత్యాల లో బిజెపి బహిష్కృత నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు బోగ శ్రావణి, ఎంపీ ధర్మపురి అరవింద్ నిప్పులు చెరిగారు... బిజెపిలో సీనియర్లు ఉండకూడదని జగిత్యాల లోనే కాకుండా కోరుట్ల కూడా తన అనుచరులే ఉండాలని కుతంత్రలకు ఎంపీ అరవింద్, శ్రావణి తెర లేపారు..... బిజెపి రక్తం మా ఒంట్లో ప్రవహిస్తుంది... అరవింద్ ఒంట్లో కాంగ్రెస్ రక్తం ప్రవహిస్తుంది... అరవింద్ శ్రావణి ఇద్దరు కూడా కోవార్డులు. ... .పార్టీ కోసం త్యాగాలు చేసిన కుటుంబాలు మావి.. శ్రావణి నువ్వు బిఆర్ఎస్ లో ఉండంగా చేసిన అరాచకాలు అందరికీ తెలుసు... మున్సిపల్ పూర్తిగా అవినీతిమయం చేశావు.. స్థానిక కౌన్సిలర్లు పార్టీ నుండి వెళ్లగొడితే మా పార్టీలోకి వచ్చావు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 50 వార్డుల కోసం పార్టీ ఇచ్చిన కోటి యాభై లక్షల రూపాయలు నిధులను నువ్వు ఖర్చు పెట్టలేదు. కనీసం నువ్వు వార్డు కౌన్సిలర్ గా కూడా గెలిచే దమ్ము శ్రావణి కి లేదు. జీవన్ రెడ్డి ఓడిపోవాలని సంజయ్ కుమార్ కు మద్దతుగా, కవితక్క ఓడిపోవాలని జీవన్ రెడ్డితో కలిసి మీరు పని చేశారు.. పార్టీ నిధులు మీరు కాజేయలేదని జగిత్యాల లోని మార్కండేయ దేవాలయంలో ఎంపీ అరవింద్ కుటుంబం, బోగ శ్రావణి కుటుంబం, ప్రమాణం చేస్తే రేపటినుండి మేము ఆమె ఇంటి ముందర చేతులు కట్టుకొని నిలబడతాం. శ్రావణి ప్రతి విషయానికి ఏడుస్తున్నావు.. అలా ఏడ్చి బి ఆర్ ఎస్ ముంచావు. ఇప్పుడు మా కొంపలు ముంచుతున్నావ్ .. పార్టీని పునాదుల నుండి పటిష్టం చేసింది మేము.. 42 వేల వరకు ఓట్లు పెరిగాయి అంటున్నావు.. మున్సిపల్ ఎన్నికల్లో ఎన్ని వేల ఓట్లు వచ్చాయి.. ఈ కార్యక్రమంలో నాయకులు ఏసీఎస్ రాజు,సిపెళ్ళి రవీందర్, లింగంపెట శ్రీనివాస్, కౌన్సిలర్ ఆరవ లక్ష్మి, అంకర్ సుధాకర్, కిషోర్ సింగ్, ఎడమల వెంకట్ రెడ్డి, బుర్ర ప్రమోద్, గొడిషేల నాగరాజు, తెనుగు భుమన్న, పొరండ్ల బిక్షపతి, నవ్వొట్ సురేష్, బిట్టు, కుర్మచలం సతీష్ , సునీల్ తదితరులు పాల్గొన్నారు...
Admin
DNB News