DNB News - తెలంగాణ / : మునగాల మాత్మ గాంధీ జాతీయ ఉపాధి చట్టరక్షణకు ఉపాధి కూలీలందరూ ఉద్యమించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు బుధవారం మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామంలో ఉపాధి హామీ పని ప్రదేశానికి సందర్శించి అనంతరం ఆయన కూలీలను ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ సర్కార్ పేదలకు వరం లాంటి చట్టాన్ని తీసివేసి జి రాంజీ పేరుతో పేదలకు మోసం చేసే పథకాన్ని తీసుకొచ్చాడని ఆయన విమర్శించారు ఉపాధి హామీ చట్టంలో కూలీల దగ్గర రెండు ఫోటోల పద్ధతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు టెంట్లు మంచినీరు సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఉపాధి హామీ చట్ట రక్షణకు మే 15న జరిగే గ్రామీణ బందులో ప్రజలందరూ పాల్గొనాలని ఆయన తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు షేక్ సైదా గ్రామ సర్పంచ్ బొల్లం యమున లింగరాజు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఆర్. రామకృష్ణారెడ్డి మండల ఉపాధ్యక్షులు అమర్ గాని కనకయ్య వీరబోయి వెంకన్న వెంపటి వీరబ్రహ్మం ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు షేక్ ఖాజాబీ వెంపటి మైసయ్య రైతు సంఘం నాయకులు నీలారపు కొమరయ్య చీమ శ్రీనివాస్ సిఐటియు నాయకులు షేక్ నబి సాహెబ్ అమర్ గాని లక్ష్మి వెంబటి నిర్మల జిల్లేపల్లి ఎల్లమ్మ బొల్లం శ్రీదేవి కాగితాల నాగమణి వెంపటి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు
Admin
DNB News