DNB News - తెలంగాణ / : హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రాంతంలో భారీ దోపిడీ సంచలనం రేపింది. కళ్లలో కారం చల్లి నగదు దోచుకెళ్లిన దుండగులు… పట్టపగలు జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సమాచారం ప్రకారం… సుమారు రూ. కోటి నగదు ఉన్న బాక్సును బైక్పై తరలిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. నగదు తీసుకెళ్తున్న బైక్ను మరో మూడు బైక్లు ఫాలో అయినట్లు తెలుస్తోంది. కేవలం వంద మీటర్లు కూడా వెళ్లకముందే… డబ్బులు తరలిస్తున్న వారిపై కారం చల్లి దాడి చేశారు దుండగులు. దాడి కారణంగా మొదటి బైక్ కిందపడిపోవడంతో… డబ్బులు ఉన్న బాక్సును ఎత్తుకెళ్లి పరారయ్యారు. ఈ ఘటన కూకట్పల్లి ఏసీపీ ఆఫీస్ సమీపంలో జరగడం గమనార్హం. దోచుకెళ్లిన నగదు హవాలా డబ్బు అయ్యి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
Admin
DNB News