DNB News - తెలంగాణ / : శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య యు ఉమేష్ కుమార్, తెలంగాణ రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయ కులపతి ఐన శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా ని కలిశారు. హైదరాబాదులో విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశంలో ఉమేష్ కుమార్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నామని విశ్వవిద్యాలయానికి నాలుగు అనుబంధ కళాశాలలో కొత్త కోర్సులను తీసుకురావడానికి ప్రయత్నాలు చేసామని దానిలో భాగంగా న్యాయ, ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు చేశాను ఫార్మసీ కళాశాలలో కొత్త కోర్సులను తీసుకువచ్చామని సిబ్బందికి బోధన బోధనేతర సిబ్బందికి విద్యార్థులకు కూడా ముఖ బయోమెట్రిక్ అమలు చేస్తున్నామని, అన్ని కళాశాలలకు డిజిటల్ తరగతి గదులను, మిషన్ భగీరథ పైప్లైన్ సాయంతో అన్ని 24 గంటల నీటి సదుపాయం ఏర్పాటు చేశామని, విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించామని, ఉపాధి సౌకర్యాలు మెరుగుపరచడానికి రెండు సార్లు జాబ్ మేళాను కూడా ఏర్పాటు చేశామని, విశ్వవిద్యాలయాన్ని బోధనలో,పరిశోధనలలో,అన్ని రంగాలలో ముందుకు తీసుకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఇతర సదుపాయాల కోసం అవసరమైన నిధులను సమకూర్చవలసిందిగా తెలియజేశారు.
Admin
DNB News