Wednesday, 22 April 2026 08:36:30 PM
# ఖమ్మం జిల్లా పేదప్రజలకు అండగా శ్రీచక్ర హాస్పిటల్. # డ్రాయింగ్ బుక్స్, స్కెచ్ పెన్నులు , కుక్కర్ ను అందించిన కార్పొరేటర్ మాసం గణేష్ # నగరంలోని అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.-తుమ్మల నాగేశ్వరరావు # ఆదోని మేక వంక ఆక్రమణలపై ఆగ్రహం – సిమెంట్ కాలువ తొలగించాలంటూ నూర్ అహ్మద్ డిమాండ్... # పత్తికొండలో OHSR ట్యాంక్ పరిశీలన – నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి... # ఎన్.టి.ఎల్. సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో 19000/ వేలరూపాయల నిత్యవసర సరుకులు అందజేత # నంద్యాలలో SDPI లీడర్స్ కాన్క్లేవ్ – ఆదోని యూనిట్ చురుకైన భాగస్వామ్యం.. # చైన్ స్నాచింగ్ కేసు ఛేదన – నిందితుడి అరెస్ట్, పల్సర్ బైక్ స్వాధీనం.. # జొన్నగిరి సమీప గోల్డ్ మైన్స్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి... # పరిశుభ్రతపై అవగాహనతో యువత ఆరోగ్యవంతమైన సమాజానికి దోహదం చేయాలి # ట్రినిటీ ది స్కూల్ ఆఫ్ లెర్నింగ్, సాలెహ్‌నగర్, కరీంనగర్ కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ విజయవంతంగా నిర్వహణ # సిద్ధమైన ఉర్దూ గర్ల్స్ కాలేజీ ప్రారంభం ఎప్పుడు? విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారా?”.. SDPI.. # శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ సీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన సంస్థాగత నిర్మాణాల వెరిఫికేషన్ ప్రక్రియ మరియు సమీక్ష సమావేశo # శాతవాహనలో “అగ్నిమాపక వారోత్సవాల అవగాహన కార్యక్రమం # మొక్కజొన్న వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాల ప్రారంభం # కరీంనగర్‌లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం # కరీంనగర్‌లో ఘనంగా కార్తికేయ జువెలరీస్ ప్రారంభోత్సవం అజ్మత్పుర # ఇంటర్ ఫలితాల్లో మైనారిటీ గురుకుల విద్యార్థులకు మెరుగైన ఫలితాలు . # ఆలూరులో చంద్రబాబు జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహణ.. # కారుణ్య నియామకాలతో అభ్యర్థులకు ఉద్యోగ భద్రత...

నగరంలోని అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.-తుమ్మల నాగేశ్వరరావు

Date : 22 April 2026 05:50 PM Views : 8

DNB News - తెలంగాణ / : ఖమ్మం నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు సౌకర్యవంతమైన మౌలిక వసతులు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం నగరంలోని చర్చికాంపౌండ్, ప్రకాష్ నగర్ ఓవర్ బ్రిడ్జ్‌ ను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బ్రిడ్జ్‌ల ప్రస్తుత పరిస్థితి, మరమ్మత్తుల అవసరం, ట్రాఫిక్ సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. చర్చికాంపౌండ్ ఓవర్ బ్రిడ్జ్‌పై ప్రయాణించే వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బ్రిడ్జ్ మధ్యభాగంలో రబ్బరు స్ట్రిప్స్ ఏర్పాటు చేసి వాహనాల ప్రయాణాన్ని సాఫీగా మార్చాలని సూచించారు. అలాగే, బ్రిడ్జ్‌పై ఉన్న గుంతలు, పగుళ్లు తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని, బ్రిడ్జ్ మీద ఉన్న పూల కుండలలో మొక్కలు సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. అవసరమైన చోట్ల హెచ్చరిక బోర్డులు, ప్రమాదాల సూచనలు ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను నివారించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నగర అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న అన్ని పనులు నాణ్యతతో, సమయపాలనతో పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను దశలవారీగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :