DNB News - తెలంగాణ / : మునగాల:తెలంగాణసాయుధ రైతాంగ పోరాటయోధుడు కామ్రేడ్ చిల్లంచర్ల రఘునాథం సతీమణి చిల్లంచర్ల వరలక్ష్మీ ఆశయసాధన కోసం వామపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని సిపిఐ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్ అన్నారు, సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన చిల్లంచర్ల వరలక్ష్మి సంతాప సభకు ఆయన ముఖ్యఅతిథిగాహాజరై మాట్లాడారు,మొదటగా సిపిఐ పార్టీ మరియు వివిధ రాజకీయ పార్టీలు నాయకులు కార్యకర్తలు చిల్లంచర్ల వరలక్ష్మి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి, ఆమెమృతికి సంతాప సూచికగా రెండు నిమిషాలు మౌనంపాటించారు, అనంతరం నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ, చిల్లంచర్ల వరలక్ష్మి మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటుఅని,ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ పోరాటాలకు ఆమె ఎల్లప్పుడూ భర్త అడుగుజాడల్లో నడుస్తూ స్ఫూర్తిదాయక పాత్ర పోషిస్తూ వెన్నుదన్నుగా నిలిచారన్నారు, వరలక్ష్మమ్మ ఉన్నత కుటుంబంలో పుట్టిన మహిళగా ఉన్నప్పటికీ కమ్యూనిస్టు పార్టీ పైన పార్టీ సిద్ధాంతం పైన ఎనలేని అభిమానం చూపించేదని,తన భర్త ప్రజా పోరాటాలకు పార్టీ కార్యక్రమాలకు సమయం కేటాయిస్తూ తీరిక లేకుండా గడుపుతున్న పరిస్థితుల్లో కుటుంబ బాధ్యతల్ని ఆమె నిర్వర్తిస్తూ తనకున్న 9 మంది పిల్లల్ని పెంచి పోషించే బాధ్యతను భుజాన వేసుకున్నదని ఆయన అన్నారు,నేటితరం మహిళలకు వరలక్ష్మమ్మ జీవితం ఒక స్ఫూర్తిదాయకమని, ప్రజా ఉద్యమాల పట్ల ఆమెకున్న అంకితభావం, సేవా గుణం ఆమెను ప్రజలకు చేరువచేసిందని ఆయన అన్నారు,ఆమె సహకారం వల్లనే మునగాల పరగణ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ ఆనాడు విస్తరించగలిగిందని ఆయన తెలిపారు, ఆమె ఆశయాలని సాధించడమే ఆమెకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని ఆయనతెలిపారు,ఈకార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులునంద్యాల రామిరెడ్డి, గుండు వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు బద్దం భద్రారెడ్డి, పైడిమరి వెంకటనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాసర్ల కోటయ్య మునగాల గ్రామఉపసర్పంచ్ కాసర్ల వెంకటేశ్వర్లు, యుగంధర్ రెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సుంకరి అజయ్ కుమార్, సత్తిబాబు, కోల ఉపేందర్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, సిపిఎంపార్టీ మండలకార్యదర్శి బుర్రి శ్రీరాములు, సిపిఐ పార్టీ నాయకులుసిహెచ్ సీతారాం, మామిడి చిన్న రాములు, రాఘవరెడ్డి, వరలక్ష్మి కుటుంబ సభ్యులు ఠాగూర్ బాబు, కందిబండసత్యనారాయణ, గిరిబాబు, వివిధరాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు, ఆర్యవైశ్య ప్రముఖులు అర్వపల్లి శంకర్, ఓరుగంటి రవి, ఎల్వీ ప్రసాద్ ,బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంతాప సభకు హాజరైన పేద మహిళలకు వరలక్ష్మమ్మ జ్ఞాపకార్థం ఆమె కుటుంబ సభ్యులు చీరల పంపిణీ చేశారు,
Admin
DNB News