Tuesday, 28 April 2026 04:12:40 PM
# పేదలకు కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి :- ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి # మాదిగ యువకుడు విజయభాస్కర్ హత్య పై మడకశిర ఎమ్మెల్యే MS రాజు ను కలసిన ఎమ్మార్పీఎస్ ప్రతినిధి బృందం # దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ అధినేతకు పితృ వియోగం.. # రాత్రి వేళల్లో కర్నూలులో కట్టుదిట్టమైన పోలీసింగ్ – ప్రజల భద్రతే లక్ష్యం.. # కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతపై ఆగ్రహం – తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్... # పట్టుదలతో పతకాల వర్షం… అంతర్జాతీయ వేదికపై ఆదోని మహిళల ఘనత... # మండల వ్యాప్తంగాఘనంగా గులాబీ జెండా రెపరెపలుబీఆర్ఎస్ పార్టీఆవిర్భావ దినోత్సవ వేడుకలు # ఆదోని జిల్లా కోసం 163వ రోజు దీక్ష – హామీ కోసం జేఏసీ ఆగ్రహం.. # పొరంబోకు భూమిపై రాజకీయ గేమ్… హెచ్చరిక బోర్డు ధ్వంసం కలకలం.. # 121 ఫిర్యాదుల స్వీకరణ – చట్టపరంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తాం కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ # పెట్రోల్, డీజిల్ కొరత లేదు – ఆందోళన వద్దు, అదనపు కొనుగోళ్లు చేయొద్దు: కలెక్టర్, ఎస్పీ హెచ్చరిక.. # ఆంధ్ర రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ కోసం సామాన్య ప్రజలు బారులు తీరడం # టిఆర్ఎస్ జండా ఆవిష్కరణ # హిందూధర్మం అంటే మతం కాదు, జీవన విధానం. .. # జై వడ్డె ఓబన్న జై వడ్డెర # వైసీపీకి భారి షాక్ – బీజేపీలోకి 30 కుటుంబాల ఘన చేరిక.. # కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం # భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ # నిజం చెప్పడం వల్ల అసౌకర్యం కలిగినా బాధ్యతతో వ్యవహరించాలి – సీనియర్ జర్నలిస్టు మగ్ధుం భాష... # హరీశ్ రావు ని శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్రామస్థుల ఆహ్వానం

ఎస్.ఆర్.ఆర్ కళాశాల అడ్మిషన్ల పెంపుదలకు అధ్యాపకులు కృషి చేయాలి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. రామకృష్ణ

Date : 24 April 2026 10:08 AM Views : 21

DNB News - తెలంగాణ / : స్థానిక శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (అటానమస్), కరీంనగర్ లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ అడ్మిషన్ల పెంపుదలపై కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. రామకృష్ణ అధ్యక్షతన అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, దోస్త్ ద్వారా డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అధ్యాపకులందరూ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులతో సంప్రదింపులు జరిపి, కళాశాలలో అందుబాటులో ఉన్న విద్యా సౌకర్యాలు, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సుల గురించి వివరించి, విద్యార్థులు ఎస్.ఆర్.ఆర్ కళాశాలను ఎంపిక చేసుకుని అడ్మిషన్ పొందేలా ప్రోత్సహించాలని కోరారు. దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్. రామకృష్ణ దోస్త్ అడ్మిషన్ల షెడ్యూల్‌ను వివరించారు. మొదటి విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని, విద్యార్థులు మే 7 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. అలాగే ఏప్రిల్ 30 నుండి మే 8 వరకు వెబ్ ఆప్షన్ల ద్వారా కోర్సులు, కళాశాలలను ఎంపిక చేసుకునే అవకాశం ఉందని, మే 14న సీట్ల కేటాయింపు జరుగుతుందని చెప్పారు. కేటాయింపు పొందిన విద్యార్థులు మే 15 నుండి మే 23 వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ దోస్త్ షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను విద్యార్థులకు విస్తృతంగా తెలియజేయాలని అధ్యాపకులను కోరారు. ఈ సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్స్ పి. నితిన్, టి. రాజయ్య, టీజీసీజీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె. సురేందర్ రెడ్డి, ఐక్యూఏసి కోఆర్డినేటర్ హర్జ్యోత్ కౌర్, స్టాఫ్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ ఎం. శ్రీనివాస్ రెడ్డి, వివిధ విభాగాల అధిపతులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :