DNB News - తెలంగాణ / : స్థానిక శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (అటానమస్), కరీంనగర్ లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ అడ్మిషన్ల పెంపుదలపై కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. రామకృష్ణ అధ్యక్షతన అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, దోస్త్ ద్వారా డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అధ్యాపకులందరూ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులతో సంప్రదింపులు జరిపి, కళాశాలలో అందుబాటులో ఉన్న విద్యా సౌకర్యాలు, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సుల గురించి వివరించి, విద్యార్థులు ఎస్.ఆర్.ఆర్ కళాశాలను ఎంపిక చేసుకుని అడ్మిషన్ పొందేలా ప్రోత్సహించాలని కోరారు. దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్. రామకృష్ణ దోస్త్ అడ్మిషన్ల షెడ్యూల్ను వివరించారు. మొదటి విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని, విద్యార్థులు మే 7 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. అలాగే ఏప్రిల్ 30 నుండి మే 8 వరకు వెబ్ ఆప్షన్ల ద్వారా కోర్సులు, కళాశాలలను ఎంపిక చేసుకునే అవకాశం ఉందని, మే 14న సీట్ల కేటాయింపు జరుగుతుందని చెప్పారు. కేటాయింపు పొందిన విద్యార్థులు మే 15 నుండి మే 23 వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ దోస్త్ షెడ్యూల్కు సంబంధించిన వివరాలను విద్యార్థులకు విస్తృతంగా తెలియజేయాలని అధ్యాపకులను కోరారు. ఈ సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్స్ పి. నితిన్, టి. రాజయ్య, టీజీసీజీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె. సురేందర్ రెడ్డి, ఐక్యూఏసి కోఆర్డినేటర్ హర్జ్యోత్ కౌర్, స్టాఫ్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ ఎం. శ్రీనివాస్ రెడ్డి, వివిధ విభాగాల అధిపతులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.
Admin
DNB News