Saturday, 18 April 2026 06:00:19 PM
# మంగ్లీపై ఆరోపణల్ని ఖండిస్తున్నాం..అడ్వకేట్స్ అసోసియేషన్ నాయకులు భూక్యా హరినాయక్ # విజయవాడలో బిజెపి కీలక సమావేశం – రాబోయే కార్యక్రమాలపై దిశానిర్దేశం.. # పోచమ్మ చెరువులో పూడికతీత పనులకు భూమి పూజ – స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై కలెక్టర్ డా.ఏ.సిరి అవగాహన # స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో పోలీసుల స్వచ్ఛత కార్యక్రమాలు... # శాతవాహనలో ప్రశాంతంగా డిగ్రీ పరీక్షలు # విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ కరీంనగర్ # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులకు అంతర్జాతీయ మ్యాథ్స్ ఒలంపియాడ్ లో పతకాలు # రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు

కర్ల రాజేష్ మృతదేహానికి ఎయిమ్స్ వైద్యుల రీ-పోస్టుమార్టం

Date : 28 February 2026 11:37 AM Views : 121

DNB News - తెలంగాణ / : కోదాడ పట్టణంలో 100 రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన (లాకప్ డెత్) కర్ల రాజేష్ మృతదేహానికి ఎట్టకేలకు రీ-పోస్టుమార్టం నిర్వహించడాన్ని ఎమ్మార్పీఎస్ పక్షాన స్వాగతిస్తున్నామని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ తెలిపారు. శుక్రవారం బీబీనగర్ ఎయిమ్స్ వైద్యుల బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రక్రియపై ఆయన స్పందిస్తూ, ప్రభుత్వం మరియు పోలీసు యంత్రాంగంపై విమర్శలు గుప్పించారు. ​ఉద్దేశపూర్వక జాప్యంపై మండిపాటు: "రాజేష్ మరణించిన మొదటి వారంలోనే రీ-పోస్టుమార్టం చేసి ఉంటే మృతికి గల కారణాలు స్పష్టంగా తెలిసేవి" అని మంద కృష్ణ పేర్కొన్నారు. కాలం గడిచేకొద్దీ మృతదేహం కుళ్ళిపోయి, ఒంటిపై ఉన్న గాయాలు కనపడకుండా పోతాయనే దురుద్దేశంతోనే పోలీసులు 100 రోజుల పాటు కాలయాపన చేశారని ఆరోపించారు. జాతీయ ఎస్సీ కమిషన్ రెండు నెలల క్రితమే ఆదేశాలు జారీ చేసినప్పటికీ, పోలీసు యంత్రాంగం వాటిని బేఖాతరు చేయడం వెనుక నిందితులను కాపాడే కుట్ర దాగి ఉందని ధ్వజమెత్తారు. ​ఎస్సీ కమిషన్ నోటీసుల వల్లే కదలిక: ఫిబ్రవరి 19న ఎస్సీ కమిషన్ మరలా నోటీసులు ఇవ్వడంతోనే ఇప్పుడు పోలీసులు హడావిడిగా రీ-పోస్టుమార్టం చేస్తున్నారని, మరి గత 90 రోజులుగా ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. "మా డిమాండ్లను, కమిషన్ ఆదేశాలను పట్టించుకోకుండా ఇన్నాళ్లూ జాప్యం చేయడం అంటే ఉద్దేశపూర్వకంగా నిందితులకు కొమ్ముకాయడమే" అని దుయ్యబట్టారు. ​అధికారుల కుట్రలను బట్టబయలు చేస్తాం: రీ-పోస్టుమార్టం నివేదికలో కేవలం వాస్తవాలు మాత్రమే ఉండాలని, న్యాయం గెలిచేలా రిపోర్టు ఉండాలని మంద కృష్ణ స్పష్టం చేశారు. "పై అధికారులు ఇప్పటికే ఈ కేసును తారుమారు చేసేందుకు కుట్రలకు తెరలేపారు. ఒకవేళ ఎవరైనా నివేదికను ప్రభావితం చేయాలని చూస్తే, అన్ని ఆధారాలతో సహా వారిని బట్టబయలు చేస్తాం" అని హెచ్చరించారు. ​నివేదికపైనే అందరి దృష్టి: బీబీనగర్ ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణులు డాక్టర్ ప్రగ్నేష్ పార్మర్ బృందం అందించే నివేదిక ఆధారంగా తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని మంద కృష్ణ తెలిపారు. రాజేష్ కుటుంబానికి పూర్తిస్థాయి న్యాయం జరిగే వరకు, దోషులు కటకటాల వెనక్కి వెళ్లే వరకు ఎమ్మార్పీఎస్ పోరాటం ఆపబోదని స్పష్టం చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :