Wednesday, 22 April 2026 03:41:18 PM
# పత్తికొండలో OHSR ట్యాంక్ పరిశీలన – నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి... # ఎన్.టి.ఎల్. సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో 19000/ వేలరూపాయల నిత్యవసర సరుకులు అందజేత # నంద్యాలలో SDPI లీడర్స్ కాన్క్లేవ్ – ఆదోని యూనిట్ చురుకైన భాగస్వామ్యం.. # చైన్ స్నాచింగ్ కేసు ఛేదన – నిందితుడి అరెస్ట్, పల్సర్ బైక్ స్వాధీనం.. # జొన్నగిరి సమీప గోల్డ్ మైన్స్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి... # పరిశుభ్రతపై అవగాహనతో యువత ఆరోగ్యవంతమైన సమాజానికి దోహదం చేయాలి # ట్రినిటీ ది స్కూల్ ఆఫ్ లెర్నింగ్, సాలెహ్‌నగర్, కరీంనగర్ కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ విజయవంతంగా నిర్వహణ # సిద్ధమైన ఉర్దూ గర్ల్స్ కాలేజీ ప్రారంభం ఎప్పుడు? విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారా?”.. SDPI.. # శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ సీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన సంస్థాగత నిర్మాణాల వెరిఫికేషన్ ప్రక్రియ మరియు సమీక్ష సమావేశo # శాతవాహనలో “అగ్నిమాపక వారోత్సవాల అవగాహన కార్యక్రమం # మొక్కజొన్న వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాల ప్రారంభం # కరీంనగర్‌లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం # కరీంనగర్‌లో ఘనంగా కార్తికేయ జువెలరీస్ ప్రారంభోత్సవం అజ్మత్పుర # ఇంటర్ ఫలితాల్లో మైనారిటీ గురుకుల విద్యార్థులకు మెరుగైన ఫలితాలు . # ఆలూరులో చంద్రబాబు జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహణ.. # కారుణ్య నియామకాలతో అభ్యర్థులకు ఉద్యోగ భద్రత... # వెంకట్రాంపురం గ్రామపరిధిలోని ఎస్.ఎం.పేట చలివేంద్రం ఘన ప్రారంభం...! # అమెరికా - ఇరాన్ మధ్య రెండో దశ శాంతి చర్చలు # కోర్టు దిక్కరణ కేసులో ఆర్డీవోకు జైలు శిక్ష # పారిశుధ్యం ప్రాధాన్యంతో డెంగ్యూ, మలేరియా వ్యాధులకు అడ్డుకట్ట… స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ

వెంకట్రాంపురం గ్రామపరిధిలోని ఎస్.ఎం.పేట చలివేంద్రం ఘన ప్రారంభం...!

Date : 19 April 2026 01:46 PM Views : 157

DNB News - తెలంగాణ / : మునగాల:మండలపరిధిలోని వెంకట్రాంపురం గ్రామపంచాయతీ పరిధిలో జాతీయ రహదారి పక్కన ఉన్న ఎస్ఎం పేట గ్రామంలో ఆదివారం మానవతా సేవకు నిలువెత్తు నిదర్శనంగా చలివేంద్రం ప్రారంభమైంది. కీర్తిశేషులు రాయల వెంకట నాగేశ్వరావు జ్ఞాపకార్థం వారి అది ఎప్పుడు కట్టారు కుమారుడు రాయల సతీష్,సాయికుమార్ ఆధ్వర్యంలో ఆదివారం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి వెన్నెపల్లి వీరబాబు రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో జాతీయ రహదారి వెంట ప్రయాణించే వాహనదారులు, బాటసారులు తీవ్రమైన దాహార్తితో ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ చలివేంద్రం వారికి ఎంతో ఉపశమనాన్ని అందించనుంది. ప్రత్యేకంగా శుభ్రమైన తాగునీరు, చల్లని నీరు అందించే విధంగా సదుపాయాలు కల్పించడం విశేషం. ఈ సందర్భంగా వేనేపల్లి వీరబాబు మాట్లాడుతూ, రాయల వెంకట నాగేశ్వరావు స్మారకార్థం వారి కుటుంబ సభ్యులు చేపట్టిన ఈసేవాకార్యక్రమం ఎంతో అభినందనీయమని కొనియాడారు. సమాజానికి సేవ చేయాలనే తపనతో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ముందుకు రావడం గొప్ప విషయమని, ఇటువంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయని అన్నారు. అదేవిధంగా రాయల కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుతూ, తమ తండ్రి సేవాభావాన్ని కొనసాగిస్తూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. వేసవి కాలమంతా నిరంతరంగా చల్లని తాగునీరు అందించేలా చలివేంద్రాన్ని నిర్వహిస్తామని చెప్పారు. గ్రామస్తులు మాట్లాడుతూ, రహదారి పక్కన ఇలాంటి చలివేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులకు ఎంతో ఉపయోగం కలుగుతుందని, ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇది పెద్ద ఉపశమనంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చలివేంద్రం ప్రారంభం సందర్భంగా అక్కడ ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోలిశెట్టి బుచ్చి పాపయ్య, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాలోతు లక్య నాయక్, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాతకోట్ల నాగరాజు, ఎస్ ఎం పేట వార్డుసభ్యులు రాయల సాయికుమార్, మాజీ వార్డు సభ్యులుకోలా వెంకటేశ్వర్లు, బెల్లంకొండ వెంకటేశ్వర్లు,బెల్లంకొండ రామారావు, మొక్క నాగరాజు, కోలా నరసయ్య, మందపల్లి నారాయణరావు, మేడం రాజు, రాయల వెంకట నరసమ్మ, లొడంగి సాయి, తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :