DNB News - తెలంగాణ / : పత్రికా ప్రకటన ఐఐటి జేఈఈ మెయిన్స్ - 2026 ఫలితాలలో అల్ఫోర్స్ కు ర్యాంకుల పంట నిన్న ప్రకటించబడిన ఐఐటి జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాలలో మా అల్ఫోర్స్ విద్యార్థులు వివిధ క్యాటగిరీలలో జాతీయస్థాయి అత్యుత్తమ ర్యాంకులు సాధించారని తెలుపుటకు సంతోషిస్తున్నాను. ఎం.శ్రీపార్టీష్ 29 వ ర్యాంకుతో అత్యున్నత స్థానంలో నిలువగా, సి.హెచ్. లక్ష్మీహాసిని 116 వ ర్యాంకు, సి.హెచ్. పూర్ణచంద్ 138, ఎస్. వర్జినిరెడ్డి 211, ఎన్. రత్నప్రకాశ్ 239, పి. అక్షయ 250, ఎ. కీర్తన 274, యు. సిద్దీశ్వర్ 459, కె. ధనుష్ 556, కె.నచికేత్ 593, బి. లిఖిత్సాయి 737, యమ్. వశిష్ట 884, కె. ప్రజ్ఞాన్ 991, రెడ్డి శ్రీకర్ 1000 వ ర్యాంకులు సాధించి అల్ఫోర్స్ కీర్తీని మరింత ఇనుమడింపజేశారు. 1000 లోపు 14 ర్యాంకులు, 2000 లోపు 18 ర్యాంకులు, 5000 లోపు 35 ర్యాంకులు సాధించగా, 450 మంది విద్యార్థులు ఐఐటి అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించడం విశేషం. రాబోయే ఐఐటి అడ్వాన్స్ పరీక్ష వ్రాయుటకు ఎంపికైన విద్యార్థులకు అత్యుత్తమ అధ్యాపక బృందముచే కోచింగ్ ఇవ్వబడును. పటిష్ట ప్రణాలికతో విద్యా భోధన మరియు నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల పట్టుదల మరియు అహర్నిషల కృషివల్ల అల్ఫోర్స్ ఇంతటి ఘన విజయం సాధించగలిగిందని ఈ సంధర్భముగా తెలియజేయుచున్నాను. రాబోయే ఐఐటి అడ్వాన్స్ పరీక్షలో కూడ మా అల్ఫోర్స్ విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించి ప్రతిష్టాత్మక ఐఐటి లలో సీట్లు సాధిస్తారని నేను విశ్వసిస్తున్నాను. ప్రతి సంవత్సరము ఐఐటీ నీట్ మరియు ఎంసెట్ పోటీ పరీక్షలలో అల్ఫోర్స్ విద్యార్థులు రాణిస్తున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఐఐటి జేఈఈ మెయిన్స్ - 2026 ఫలితాలలో జాతీయస్థాయి అత్యున్నత ర్యాంకులు సాధించిన మా అల్ఫోర్స్ చిన్నారులను మరియు వారి తల్లిదండ్రులను మన.స్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంతటి ఘన విజయమునకు తోడ్పడిన మా అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. పై విషయమును మీ పత్రిక ద్వారా ప్రజల దృష్టికి తీసుకవెళ్ళగలరు. వి. నరేందర్ రెడ్డి చైర్మెన్ అల్ఫోర్స్ విద్యాసంస్థలు
Admin
DNB News