Monday, 15 June 2026 01:55:52 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

రక్తదానానికి యువత ముందుకురావాలి: డీఎస్పీ ఆదినారాయణ

Date : 26 March 2026 04:33 PM Views : 42

DNB News - తెలంగాణ / : ప్రజాస్ఫూర్తి, కొత్తగూడెం: రక్తదానం చేయడానికి యువత పెద్ద సంఖ్యలో ముందుకు రావాలని కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ పిలుపునిచ్చారు. తద్వారా ప్రమాదంలో ఉన్న వారికి సకాలంలో రక్తం అంది ప్రాణాలు దక్కుతాయని చెప్పారు. యంగ్‌ ఇండియన్‌ బ్లడ్‌ డోనర్స్‌ క్లబ్‌ వ్యవస్థాపక అధ్యక్షులు జె. బాలు ఆధ్వర్యంలో బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోగల కొత్తగూడెం ఏరియా హాస్పిటల్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని డీఎస్పీ ఆదినారాయణ ప్రారంభించి మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సమాజ హితానికి పాటుపడాలని సూచించారు. రక్తదానం చేయడం ద్వారా మరొకరి ప్రాణాలను కాపాడవచ్చునని, ప్రతీ ఒక్క వ్యక్తి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చునన్నారు. క్లబ్‌ వ్యవస్థాపకులు జె.బాలు మాట్లాడుతూ ప్రతీ ఇంటి నుండి ఒక్క రక్తదాత ఉండేలా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఎప్పుడు ఎవరికి ఏ గ్రూపు రక్తం అవసరం వచ్చినా తమను సంప్రదించవచ్చునని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరకకుండా ఎవరూ చనిపోకూడదనేది తమ క్లబ్‌ ముఖ్య ఉద్దేశ్యమని వివరించారు. కేవలం అవసరమైన సమయంలో రక్త దాతల నుండి రక్తం అడగడమే కాకుండా స్వయంగా ప్రతి ఒక్కరు రక్తదాతలు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వాస్పత్రుల్లో రక్తదానం చేయాలని, తద్వారా ఆస్పత్రుల్లో ఆయా గ్రూపుల రక్తం నిల్వలు ఉండి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుతాయని అన్నారు. ఇప్పటివరకు తమ క్లబ్‌ ద్వారా 46,500 మంది బాధితులకు రక్తదానం చేసినట్లు తెలిపారు. అసిస్టెంట్‌ మోటారు వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సంగం వెంకటపుల్లయ్య మాట్లాడుతూ వాహనదారులు రక్షణ చర్యలు పాటించడం ద్వారా ప్రమాదాలు జరిగిన సందర్భంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చునని, వాహనదారులు హెల్మెట్, సీట్‌బెల్టు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. దాతలు చేసే రక్తదానం ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రాణాలను కాపాడుతుందన్నారు. ఈ శిబిరంలో 37 మంది రక్తదానం చేసినట్లు బాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో సి.ఐ. ఇంద్రసేనారెడ్డి, డాక్టర్‌ ప్రవీణ్‌ రెడ్డి, వీరునాయక్, భరత్, రాజేష్, జుబ్బు, జయశ్రీ, కమలారాణి తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :