DNB News - తెలంగాణ / : తెలుగు రాష్ట్రాలు తీవ్రమైన ఎండలతో అల్లాడుతున్నాయి. ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటుతున్నాయి. వాతావరణ శాస్త్రవేత్తలు దీనిని వాతావరణ విపత్తుగా అభివర్ణిస్తున్నారు. తెలంగాణలోని ఉత్తర జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు..!!
Admin
DNB News