DNB News - తెలంగాణ / : నేడు మండల పరిధిలోని నరసింహపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం పురస్కరించుకొని గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ. నాడు గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం సిద్ధించాలంటే పల్లెలు బాగుండాలని పల్లెలు బాగుంటేనే రాష్ట్రాలు దేశం బాగుంటుందని ప్రజాస్వామ్య వ్యవస్థలో గ్రామ పంచాయతీ లు. కీలకమని. ఆ వ్యవస్థ బలంగా ఉన్నప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందని. అలాగే గ్రామాభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని. అలాగే గ్రామ సభలు. గ్రామ అభివృద్ధికి ఎంతో దహతపడతాయని. . అలాగే ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వ్యక్తిగత పరిశుభ్రతను అలవర్చుకోవాలని. గ్రామంలో ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను ఉపయోగించుకోవాలని. అన్నారు స్వచ్ఛభారత్ కార్యక్రమం లో భాగంగా. అందరూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతామని సామూహిక ప్రతిజ్ఞ చేశారు. . అలాగే గ్రామంలో వివిధరకాల పనుల తీర్మానాలను ఏకగ్రీవంగా తీర్మానించారు గ్రామంలో ఉన్న శ్రీ కోదండ రామస్వామి దేవాలయం ప్రధాన అర్చకుల వేతనం గురించి చర్చించి. సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళ్లారు ఇంకా ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రెడ్డబోయిన ప్రశాంత్ వార్డ్ సభ్యులు వీరబోయిన నరేష్ రేవూరి కళ్యాణి. పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు. అంగన్వాడీ. ఆశ సమబావన సంఘం లీడర్లు. గ్రామ పెద్దలు మహిళలు యువత తదితరులు పాల్గొన్నారు
Admin
DNB News