DNB News - తెలంగాణ / : కరీంనగర్లోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ పాఠశాల సీబీఎస్సీ మరియు పారడైజ్ విద్యాసంస్థల్లో మంగళవారం రోజున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో భాగంగా చైర్మన్ డా.పి.ఫాతిమా రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ అద్భుతమైన సేవలను కొనియాడారు. సమానత్వం, న్యాయం, విద్య వంటి విలువలను సమాజానికి అందించిన మహనీయుడిగా ఆయనను కొనియాడుతూ, ఆయన చూపిన మార్గంలో నేటి యువతరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని అంబేద్కర్ ఆలోచనలు, సిద్ధాంతాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
Admin
DNB News