DNB News - తెలంగాణ / : NH 09నుండి నేలమర్రి వరకు 24 కోట్లతో డబుల్ రోడ్డు విస్తరణ పనులకు జిల్లా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నిధులు మంజూరు చేపించడం హర్షణీయమని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తక్కెలపాటి సాయి అన్నారు. ఈ రహదారి అభివృద్ధి వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కలుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా రహదారి విస్తరణకు సహకరించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వారి చొరవతోనే సింగిల్ రోడ్డును డబల్ రోడ్డు విస్తరణ చేయడంతో, ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని సాయి అన్నారు. డబుల్ రోడ్డు నిర్మాణంతో తాడ్వాయి, వెంకట్రామపురం, నేలమర్రి ప్రాంతాల మధ్య రాకపోకలు సులభమవడంతో పాటు ప్రమాదాలు కూడా. తగ్గుతాయని ఆయన తెలిపారు. కోదాడ నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి చేస్తున్న కృషి కి ప్రజలు రుణపడి ఉంటారని తెలిపారు.
Admin
DNB News