DNB News - తెలంగాణ / : విద్యార్థులకు పటిష్టమైన ప్రణాళికలను రూపొందిస్తూ వారిని సంచలనాత్మక విజయాలను నమోదు చేసే విధంగా ప్రోత్సాహం అందిస్తూ వారి కలలను సహకారం చేస్తున్నామని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి. నరేందర్ రెడ్డి స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనీ టాట్స్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర పదవ తరగతి ఫలితాల్లో అద్భుతమైన ఫలితాలు సాధించడం పట్ల ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక విలేకరుల సమావేశానికి మరియు అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు ప్రకటించినటువంటి పదవ తరగతి ఫలితాలలో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సైతం పై చెయి సాధించడమే కాకుండా అద్భుతమైన ఫలితాలను సాధించడం అల్ఫోర్స్ విద్యా విధానానికి ఒక గొప్ప ప్రతికాని వారు గుర్తు చేశారు. విద్యార్థులు ప్రతి ఒక్కరు లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా తల్లిదండ్రులు ఆశయాలకు అనుగుణంగా కృషి చేస్తూ తరగతి గదిలో బోధించినటువంటి విషయాలు ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ అద్భుతమైనటువంటి ఫలితాలు వైపు పయనించాలని వారు సూచించారు. అల్ఫోర్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో ఆర్.సాత్విక్ 589 మార్కులతో అగ్రస్థానంలో నిలిచాడని, ఓ.ఆద్య, టి.రాజు, బి.అక్షిత్ రెడ్డి, 588 మార్కులు సాధించారని, 1274 మంది విద్యార్థులకు 1026 విద్యార్థులు 500 మార్కులు పైన సాధించడం చాలా స్ఫూర్తిదాయకమని చెప్పారు. 48 మంది విద్యార్థులు 580 మార్కులు పైగా సాధించారని మరియు 334 మంది విద్యార్థులు 560 మార్కులు పైగా సాధించడం చాలా గొప్ప విషయమని హర్షం వ్యక్తం చేశారు అద్భుతమైన విజయాల సాధనకు అహర్నిశలు కృషి చేస్తున్న సిబ్బందికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. అనునిత్యం వారి పిల్లలకు ప్రోత్సాహం అందిస్తూ లక్ష్యాల వైపు పయనించే విధంగా ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు వారి పిల్లలకు అత్యంత నాణ్యమైన విద్యను అందిస్తున్నందుకు మరియు అద్భుతమైనటువంటి ఫలితాలను సాధింపచేసినందుకు నరేందర్ రెడ్డి ని తల్లిదండ్రులు ప్రశంసిస్తూ అభినందించారు మరియు ఘనంగా సత్కరించారు
Admin
DNB News